Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (23:38 IST)
ఆగ్నేయాసియా దేశాలను ఓ భారీ భూకంపం వణికించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఈ ప్రకంపన ధాటికి భారీ భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. మయన్మార్‌లో పలుచోట్ల రోడ్లు బీటలు వారాయి. ఒక్క రోజులోనే మూడు వరుస భూకంపాలు ఈ చిన్న దేశాన్ని అతలాకుతలం చేశాయి. 
 
మయన్మార్‍‌లో భూకంపం కారణంగా ఇప్పటివరకు 153 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల్లో చిక్కుకుని 800 మంది గాయపడ్డారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అటు థాయ్‌‍లాండ్‌‍, బంగ్లాదేశ్‌లోనూ భూకంపాలు సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయ్యాయి. 
 
మరోవైపు, భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు భారత్ తనవంతుగా ముందుకు వచ్చింది. మయన్మార్‌కు మానవతా కోణంలో సాయం చేసేందుకు వివిధ రకాలనై సామాగ్రిని పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments