Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (11:33 IST)
లిబియాలో దారుణం చోటుచేసుకుంది. లిబియాలోని మధ్యధరా సముద్రంలో  రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 160 మంది జలసమాధి అయ్యారు. ఈ రెండు ప్రమాదాలు గత వారం రోజుల్లో జరిగాయని వలసదారుల విభాగం అధికార ప్రతినిధి సఫా సెహ్లి తెలిపారు. వీరంతా ఐరోపాకు అక్రమంగా వలసపోతున్నవారేనని చెప్పారు. 
 
చెక్క, రబ్బరు పడవల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై.. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 1500మంది ప్రాణాలు కోల్పోయారని.. దాదాపు 12వేల మందిని భద్రతా సిబ్బంది లిబియాకు తీసుకొచ్చారని చెప్పారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, పేదరికం వల్ల వలసపోతున్న వారికి లిబియా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.
 
లిబియాలో వలసదారులపై దారుణాలు జరుగుతున్నాయి. తిరిగి వచ్చిన వారిని బలవంతపు కార్మికులను చేయడం, కొట్టడం, అత్యాచారాలకు పాల్పడటం జరుగుతోంది. వలసదారులు అక్రమ రవాణాదారుల పడవలపై లిబియాను విడిచిపెట్టడానికి అనుమతించడానికి ముందు కుటుంబాల నుండి డబ్బును దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments