Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో ఘోర ప్రమాదం.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన 18 మంది... అలా జరగడం..?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (22:11 IST)
లిబియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దాంతో 57 మంది మృతి చెందారని భావిస్తున్నట్టు యూఎన్‌ మైగ్రేషన్‌ అధికారి ఒకరు తెలిపారు.

మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారని తెలుస్తోంది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలోనే పడవ ఆగిపోగా ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బోల్తాపడిందని సమాచారం.
 
పశ్చిమ తీరం కుమ్స్ నుంచి ఆదివారం ఈ పడవ బయలు దేరిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధికార ప్రతినిధి సఫా మెహ్లీ చెప్పారు. మృతుల్లో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వారున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నారు.
 
మునిగిపోయినట్టు భావిస్తున్న 57 మందిలో 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయిందని, ఆ తరువాత ప్రతికూల పరిస్థితుల్లో బోల్తా పడిందని తెలిసింది. ఈ ప్రమాదంలో 18 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. 
 
లిబియా తీరంలో వారం రోజుల్లో వలస కార్మికుల పడవ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఐరోపాలో మెరుగైన జీవితం కోసం వలస దారులు, శరణార్ధులు మధ్యధరాసముద్రం మీదుగా పడవల్లో వలస వెళ్తుండడం తరచుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా మరో 500 మంది వలస వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అధికారులు అడ్డుకుని లిబియాకు తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments