ఎయిర్‌పోర్టు అధికారుల కళ్ళగప్పి ఫ్లైట్ చక్రాల్లో దాక్కుని ప్రయాణం..

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:23 IST)
సాధారణంగా రైళ్లు, బస్సుల్లో దొంగతనంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా, రైళ్ళలో అయితే, బాత్రూమ్‌లు సీట్ల కింద దాక్కొని ప్రయాణం చేయొచ్చు. కానీ, విమానాల్లో మాత్రం అలా సాధ్యపడదు. కానీ, ఓ ప్రయాణికుడు మాత్రం ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగప్పి.. ఏకంగా 1640 కిలోమీటర్ల మేరకు ప్రయాణించాడు. ఈ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన తీరు చూసి ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్యాటెమాల సిటీ నుంచి మియామీకి ఒక విమానం బయలుదేరింది. ఈ విమానం ల్యాండింగ్ గేర్ బాక్స్ లోపల కూర్చొని ఏకంగా 1,640 కిలోమీటర్ల దూరంపాటు నాలుగైదు గంటలు కూర్చొని ప్రయాణం చేశాడు. 
 
ఆ విమానం మియామీలో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణికుడు బయటకు రాగా, గ్రౌండ్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా ప్రయాణించిన ప్రయాణికుడి వివరాలు వెల్లడికాలేదు. అతని వద్ద ఎయిర్ పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments