Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలా.. పాకిస్థాన్‌లా మారిపోయింది.. మమత.. రాహుల్ ఫైర్

దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కర్ణాటక రాజకీయాలపై స్పందించారు. ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలు చేసే పద్ధతి దేశానికి మంచిది కాదని మమత తెలిపార

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (11:19 IST)
దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కర్ణాటక రాజకీయాలపై స్పందించారు. ఎమ్మెల్యేలతో ఇలా బేరసారాలు చేసే పద్ధతి దేశానికి మంచిది కాదని మమత తెలిపారు.
 
తాము ప్రజాస్వామ్య పద్ధతులను ఎల్లప్పుడూ గౌరవిస్తామని, అయితే ఇలా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే అది దేశ పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు అధికారంలో వుండే వారు రేపు వుండరని మమత గుర్తు చేశారు.
 
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పనిచేసినప్పటికీ తమ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకుందని, దీన్ని బట్టి తాము గ్రామస్థాయి నుంచి ఎంత బలంగా ఉన్నామో తెలుస్తోందన్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై మాటల దాడిని తీవ్రతరం చేశారు. దేశంలో ఉన్న పరిస్థితులు పాకిస్థాన్‌లో మాదిరిగా ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సుప్రీం కోర్టు జడ్జీలను కూడా భయపెడుతుందని.. ఇలాంటిది నియంతృత్వంలోనే జరుగుతుందన్నారు.
 
రాజ్యాంగంపైనే దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ఒకవైపు ఎమ్మెల్యేలంతా నిలబడి ఉంటే, మరోవైపు గవర్నర్ ఉన్నారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్న జేడీఎస్ ఆరోపణలను రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments