Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (17:37 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు చేసిన నోటిదూల వ్యాఖ్యలు ఇపుడు ఆ దేశాన్ని తీవ్రమైన కష్టాల్లోకి నెట్టేశాయి. భారత పర్యాటకులంతా మాల్దీవులకు వెళ్ళడం మానేశారు. దీంతో ఆ దేశ పర్యాటక రంగం బోసిపోయింది. విదేశీ మారకద్రవ్య రాబడి తగ్గిపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఓ విన్నపం చేశారు. హిందూ మహాసముద్రం లోతట్టు ప్రదేశంలో ఉండే మాల్దీవులు అంతర్జాతీయ సాయానికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమస్థానంలో ఉంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రముఖ బ్రిటన్ పత్రిక ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. 
 
ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్ధించారు. పర్యటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు (ఎఐడీఎస్) ప్రతీ పదేళ్లకోసారి సమావేశమవుతుంటాయి. ఇక్కడ ఆయా దేశాల అభివృద్ధే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, అటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే.. అందులో కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు వ్యాఖ్యానించారు. కానీ, ప్రపంచ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడీపీ చిలీ, మెక్సికో, మలేషియా, చైనా తలసరి జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం 500 మిలియన్ డాలర్ల ధనం అవసరమవుతుందని ముయిజ్జు పేర్కొన్నారు. ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారమవుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments