శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా

Webdunia
సోమవారం, 9 మే 2022 (17:12 IST)
Mahinda Rajapaksa
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సోమవారం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్న కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 
 
మరోవైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. 
 
మహింద రాజపక్స రాజీనామా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
 
విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో ధరలు భారీగా పెరగడంతో ఆహార సంక్షోభం నెలకొంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 
 
మరోవైపు విద్యుత్‌ కోతలు భారీగా విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించినా.. లెక్క చేయకుండా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
దీంతో సోమవారం ప్రధాని పదవికి మహింద రాజపక్స పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ప్రొఫెసర్‌ చన్నా జయసుమన సైతం రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments