Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమత్రాదీవుల్లో తీవ్ర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదు.. 20 మంది మృతి

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:18 IST)
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ ఘటనలో అనేక మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు
 
కాగా, ఇప్పటికైతే ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున భారీ అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నారు. ఇంకా ఈ సునామీలో భారత్‌లో 8వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments