Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమత్రాదీవుల్లో తీవ్ర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదు.. 20 మంది మృతి

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:18 IST)
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున రిక్టారు స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ ఘటనలో అనేక మంది గాయాల పాలైనట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు
 
కాగా, ఇప్పటికైతే ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. భూకంపకేంద్ర ప్రాంతానికి దాదాపు 836 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎటువంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
 
2004లో ఆసె ప్రాంతంలో ఒకసారి సునామీ వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో దాదాపు 30మీటర్ల ఎత్తున భారీ అలలు విరుచుకుపడటంతో దాదాపు 1,70,000 మంది చనిపోయినట్లు గణాంకాలు చెప్తున్నారు. ఇంకా ఈ సునామీలో భారత్‌లో 8వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments