Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే పగ్గాలు శశికళ చేతిలో పెడితే.. పన్నీర్ సెల్వంకు కష్టమే: స్వామి

భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (10:00 IST)
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత కన్నుమూసిన నేపథ్యంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సోమవారం రాత్రి జయలలిత కన్నుమూయడంతో పన్నీర్‌ సెల్వం తన మంత్రివర్గ సహచరులతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ చేతిలో పెడితే కొత్తగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని వ్యాఖ్యానించారు. 
 
అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. శశికళ పార్టీ బాధ్యతలు తీసుకుంటే సీఎం పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేసే వీలు ఉండదని, ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం ఒత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. పన్నీర్‌ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments