Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో కూలిన విమానం... 12 గంటలు ఈది ఒడ్డుకు చేరిన రక్షణమంత్రి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (07:51 IST)
ఇటీవల 64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో ఒక బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే నడి సముద్రంలోకి వెళ్లిన తర్వాత హెలికాఫ్టరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో మంత్రితో ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు. 
 
కానీ, ఆయన మాత్రం సీటును ఊడబెరికి దాన్ని లైఫ్ జాకెట్‌లా ఉపయోగించుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయన్ను గమనించి ఒడ్డుకు చేర్చారు. మరోవైపు, మంత్రితో పాటు ప్రయాణించినవారిలో చీఫ్ వారెంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సహసమే చేశారు. 
 
ఆయన కూడా ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. పైవాడి నుంచి తనకు పిలుపు రాకపోవడం వల్లే తీరానికి చేరుకోగలిగాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments