Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు దశాబ్దాల తర్వాత భూమికి చంద్ర శిలలు

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (07:46 IST)
నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి చంద్రుడి మీద నుంచి నమూనాలు (చంద్ర శిలలు) భూమికి చేరనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మిషన్‌ చేపట్టిన చైనా క్యాప్సుల్స్‌ (చాంగ్‌ 5) వారం కిందటే చైనాపై ల్యాండ్‌ అయ్యింది.

చంద్రుడిపై రాళ్లు, ఇతర మృత్తికలు డ్రిల్లింగ్‌ ద్వారా సమీకరించిన చాంగ్‌ ఆదివారం ఉదయం తిరిగి భూమికి బయల్దేరింది. నాలుగు ఇంజన్లను 22 నిమిషాలు పాటు పని చేయించడం ద్వారా చంద్రుని కక్ష్య నుంచి చాంగ్‌ 5 బయలుదేరిందని చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ (నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

మూడు రోజుల్లో మంగోలియా ప్రాంతానికి చాంగ్‌ 5 చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో జాబిల్లిని చేరుకున్న చాంగ్‌ 5 అక్కడ సుమారు రెండు కిలోల రాళ్ల నమూనాలను సేకరించింది.

1976లో నాటి సోవియట్‌ యూనియన్‌ పంపిన లూనా 24 చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో జాబిల్లి నుంచి నమూనాలు తీసుకురావడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments