Publish Date: Mon, 20 Apr 2020 (18:08 IST)
Updated Date: Mon, 20 Apr 2020 (18:11 IST)
కరోనా వైరస్ కల్లోల సమయంలో జపాన్ దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని మియాగీ ప్రాంతంలో ఉదయం భూకంపం సంభవించిందని జపాన్ అధికారులు చెప్పారు.
ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైందని జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం ప్రభావం టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా ప్రభావితమైంది.
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు.