Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌ లో కరోనా విజృంభణ.. 24గంటల్లో 1553 కొత్త కేసులు

Advertiesment
Corona
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:05 IST)
దేశంలో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో భారత్‌లో 1553 కొత్త కేసులు; 36 మరణాలు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లాక్‌డౌన్‌ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. గోవాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు లేవని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టంచేశారు.

కరోనా వైరస్‌ కేసులు రెట్టింపు లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5గా ఉందన్నారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 2546మంది రికవరీ/ డిశ్చార్జి కాగా దీని రేటు 14.75శాతంగా ఉందని చెప్పారు.
Corona boom in India

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు