Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో ఒకే చోట 38 కరోనా కేసులు

Advertiesment
corona cases
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (18:01 IST)
న్యూఢిల్లీలో కరోనా వైరస్ మరణమృదంగాన్నే మోగిస్తోంది. దక్షిణ ఢిల్లీ పరిధిలోని తుగ్లకాబాద్, ఇప్పుడు దేశ రాజధానిలో మూడో అతిపెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది.

తాజాగా ఇక్కడ 38 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. తొలుత ఇక్కడ ముగ్గురికి వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి నిత్యావసరాల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు.

ఆపై ఈ ప్రాంతంలోని 94 మందికి కరోనా వైద్య పరీక్షలు చేయగా, 35 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో తుగ్లకాబాద్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్నంతా సీజ్ చేసిన అధికారులు, కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

ఈ 35 మందితోనూ కాంటాక్ట్ అయిన వారందరి వివరాలనూ సేకరించి, వారిని క్వారంటైన్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

కాగా, న్యూఢిల్లీలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ గా నిజాముద్దీన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన మత ప్రార్థనల కారణంగా, దేశంలో వేలాది మందికి వైరస్ సోకింది. ఇక, రెండో హాట్ స్పాట్ గా చాందినీ మహల్ ప్రాంతం నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్‌లో వాహనాలు సీజ్ చేస్తే ఇక తిరిగి ఇవ్వరు : తెలంగాణ పోలీసులు