Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రూ.10 కోట్లతో కృష్ణుడి దేవాలయం.. ఖర్చంతా సర్కారుదే..!

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (10:15 IST)
పాకిస్థాన్‌లో రూ. 10 కోట్లతో కృష్ణుడి దేవాలయం నిర్మితమవుతోంది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు అయ్యే ఖర్చును ఆదేశ ప్రభుత్వమే భరిస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణంలో జాప్యం ఏర్పడుతోంది. ఇస్లామాబాద్‌లో పది కోట్ల రూపాయలతో హిందూ దేవాలయం నిర్మాణం పనులను పాకిస్థాన్ ప్రభుత్వం మొదలు పెట్టింది.
 
ఇస్లామాబాద్‌లో ఇదే తొలి హిందూ ఆలయం కావడం విశేషం. 20వేల చదరపు అడుగుల స్థలంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీనికి పార్లమెంటరీ మానవ హక్కుల సంఘం కార్యదర్శి లాల్ చంద్ మల్హి మంగళవారం భూమిపూజ చేశారు. గత రెండు దశాబ్దాల్లో ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా గణనీయంగా పెరిగిందని మల్హి చెప్పినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
కొత్తగా నిర్మించబోయే ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ పేరు పెట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 10 కోట్లను పాక్ మతపరమైన వ్యవహారాల శాఖ మంత్రి పిర్ నూరుల్ హక్ ఖాద్రీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments