తెలంగాణలో హరిత హారం.. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటడమే లక్ష్యం

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (09:49 IST)
తెలంగాణ సర్కారు ఈ నెల 25 నుంచి అంటే గురువారం నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది. 
 
30 కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు సైతం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నర్సాపూర్‌లో మొక్క నాటి ఈ హరితహారాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవి పునరుద్ధరణలో భాగంగా ఆయన మొక్క నాటి ఆరో విడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Toxic : యశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో టాక్సిక్ .రిలీజ్ డేట్ పోస్టర్

Ravi Teja: మధ్యతరగతి తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఇరుముడి చిత్రం

Venkatesh: కత్తిలాంటి ఐడియా ఎలా వుంటుందో అనిల్ కు చూపించిన విక్టరీ వెంకటేష్

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?

తర్వాతి కథనం
Show comments