Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో హరిత హారం.. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు నాటడమే లక్ష్యం

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (09:49 IST)
తెలంగాణ సర్కారు ఈ నెల 25 నుంచి అంటే గురువారం నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది. 
 
30 కోట్లకుపైగా మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్నాహాలు సైతం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నర్సాపూర్‌లో మొక్క నాటి ఈ హరితహారాన్ని ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవి పునరుద్ధరణలో భాగంగా ఆయన మొక్క నాటి ఆరో విడత హరితహారానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments