Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి...

ఠాగూర్
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (11:20 IST)
లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి జరిగింది. గత 2011 నుంచి లిబియాలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ ప్రాంతం తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయి పాలన సాగుతుంది. 2014లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. అయితే, ఈ ప్రభుత్వాన్ని తూర్పు ప్రాంత పార్లమెంట్ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై సోమవారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని మంత్రి ఒకరు తెలిపారు. ఈ రాకెట్ దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మొహరించాయి. 
 
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే పాలించుకుంటున్నారు. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలోని నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించడంతో లిబియా దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments