Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు మృతి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:11 IST)
marble mine
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జియారత్ ఘర్ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు కుప్పకూలాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు ఉండడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల్లో 12 మంది మైనర్లు ఉన్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
 
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఈ శ్రేణుల్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments