Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌ గనిలో ప్రమాదం.. 162కి చేరిన మృతుల సంఖ్య (Video)

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (23:33 IST)
మయన్మార్‌ కచిన్ రాష్ట్రంలో హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి గనిలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 162కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ గనిని తవ్వి తీసిన మట్టి పక్కనపోస్తుంటారు. అయితే, ఈ గనిలో పనిచేస్తున్న కార్మికులు అక్కడే తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. 
 
గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పక్కన పోసిన మట్టి.. కార్మికుల షెల్టర్లపై పడటంతో పలువురు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది ఇప్పటికే మరణించగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ 162 మృతదేహాలు వెలికితీశారు.
 
మట్టి దిబ్బల కింద మరికొంత మంది సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 2015లో కూడా ఇలాంటి ఘటన ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పటి సమాచారం ప్రకారం 113 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments