Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగం ఊడితే.. అదృష్టం అలా వరించింది...

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:48 IST)
కరోనా కారణంగా ఉద్యోగం ఊడింది. నోటీస్ పీరియడ్ కింద పనిచేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతడిని అదృష్టం వరించింది. లాటరీ రూపంలో కోట్లు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్‌ సజీవన్‌ (30) నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా గత నెలలో ఆయనను ఉద్యోగం నుంచి తీసివేశారు.
 
నోటీసు పీరియడ్‌లో పని చేస్తున్న ఇతను ఒక మిలియన్‌ డాలర్ల లాటరీ (సుమారు రూ.7.4 కోట్లు)ని గెలుచుకున్నట్టు ఆదివారం దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ డ్రా నిర్వాహకులు తెలిపారు. ఈ మాట విన్న అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
నవంబరు 22న ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ను నవనీత్‌ కొనుగోలు చేశాడు. కష్టాల్లో ఉన్న తరుణంలో లాటరీ రావడం నమ్మశక్యంగా లేదని, తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని, ఇప్పుడెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని సహోద్యోగులు, స్నేహితులకు ఇవ్వనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments