Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగం ఊడితే.. అదృష్టం అలా వరించింది...

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:48 IST)
కరోనా కారణంగా ఉద్యోగం ఊడింది. నోటీస్ పీరియడ్ కింద పనిచేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతడిని అదృష్టం వరించింది. లాటరీ రూపంలో కోట్లు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్‌ సజీవన్‌ (30) నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా గత నెలలో ఆయనను ఉద్యోగం నుంచి తీసివేశారు.
 
నోటీసు పీరియడ్‌లో పని చేస్తున్న ఇతను ఒక మిలియన్‌ డాలర్ల లాటరీ (సుమారు రూ.7.4 కోట్లు)ని గెలుచుకున్నట్టు ఆదివారం దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ డ్రా నిర్వాహకులు తెలిపారు. ఈ మాట విన్న అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
నవంబరు 22న ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ను నవనీత్‌ కొనుగోలు చేశాడు. కష్టాల్లో ఉన్న తరుణంలో లాటరీ రావడం నమ్మశక్యంగా లేదని, తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని, ఇప్పుడెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని సహోద్యోగులు, స్నేహితులకు ఇవ్వనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments