Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఉద్యోగం ఊడితే.. అదృష్టం అలా వరించింది...

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:48 IST)
కరోనా కారణంగా ఉద్యోగం ఊడింది. నోటీస్ పీరియడ్ కింద పనిచేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో అతడిని అదృష్టం వరించింది. లాటరీ రూపంలో కోట్లు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కసర్‌గాడ్‌కు చెందిన నవనీత్‌ సజీవన్‌ (30) నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. కోవిడ్‌ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా గత నెలలో ఆయనను ఉద్యోగం నుంచి తీసివేశారు.
 
నోటీసు పీరియడ్‌లో పని చేస్తున్న ఇతను ఒక మిలియన్‌ డాలర్ల లాటరీ (సుమారు రూ.7.4 కోట్లు)ని గెలుచుకున్నట్టు ఆదివారం దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ డ్రా నిర్వాహకులు తెలిపారు. ఈ మాట విన్న అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
 
నవంబరు 22న ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ను నవనీత్‌ కొనుగోలు చేశాడు. కష్టాల్లో ఉన్న తరుణంలో లాటరీ రావడం నమ్మశక్యంగా లేదని, తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని, ఇప్పుడెంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు వచ్చిన సొమ్ములో కొంత మొత్తాన్ని సహోద్యోగులు, స్నేహితులకు ఇవ్వనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments