Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంద్రాగస్టు : భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర... ఉసిగొల్పుతున్న పాక్

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:43 IST)
ఈ నెల 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల సమయంలో దేశంలో విధ్వంసానికి ఇస్లామిక్ సేట్ట్ ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ కుట్రపన్నింది. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. 
 
ముఖ్యంగా, ఆగస్ట 15వ తేదీ కంటే ముందుగానే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 
 
ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాయి. వీటికి ఐసిస్ కూడా తన వంతు సహకారం అందిస్తోంది. కాశ్మీర్‌ను విభజిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భారత్‌లో దాడులకు ఉగ్రమూకలను పురిగొల్పే విధంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌లో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోనున్నాయని ఇంటెలెజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments