Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో వేలెట్టం... అది మా విధానం కాదు : తాలిబన్

Webdunia
మంగళవారం, 19 మే 2020 (14:26 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ అంశంపై తాలిబన్ తీవ్రవాద సంస్థ తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేసింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పైగా, ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చే ఉద్దేశ్యం తమకు ఎంతమాత్రం లేదని, అస్సలు అది తమ విధానం కాదని విస్పష్టం చేసింది. 
 
కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సుహేల్ షహీన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ అమిరాత్ స్పష్టమైన విధానం అని ఆయన తేల్చి చెప్పారు. 
 
తాలిబన్ల రాజకీయ విభాగంగా అఫ్ఘాన్ ఇస్లామిక్ అమిరాత్ ప్రకటించుకుంది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్‌తో స్నేహం అసాధ్యమని, కాబూల్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత కాశ్మీర్‌ను కాఫిర్ల నుంచి విముక్తం చేస్తామని తాలిబన్ ప్రతినిధిగా చెప్పుకునే జబీవుల్లా ముజాహిద్ పేరిట వచ్చిన ప్రకటన వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దీంతో సుహేల్ షపీన్ ఓ ట్వీట్ చేస్తూ, కాశ్మీర్ అంశంలో తమ వైఖరిని తేటతెల్లం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments