Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో వేలెట్టం... అది మా విధానం కాదు : తాలిబన్

Webdunia
మంగళవారం, 19 మే 2020 (14:26 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ అంశంపై తాలిబన్ తీవ్రవాద సంస్థ తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేసింది. కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. పైగా, ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చే ఉద్దేశ్యం తమకు ఎంతమాత్రం లేదని, అస్సలు అది తమ విధానం కాదని విస్పష్టం చేసింది. 
 
కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రతినిధి సుహేల్ షహీన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. కాశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ అమిరాత్ స్పష్టమైన విధానం అని ఆయన తేల్చి చెప్పారు. 
 
తాలిబన్ల రాజకీయ విభాగంగా అఫ్ఘాన్ ఇస్లామిక్ అమిరాత్ ప్రకటించుకుంది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్‌తో స్నేహం అసాధ్యమని, కాబూల్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత కాశ్మీర్‌ను కాఫిర్ల నుంచి విముక్తం చేస్తామని తాలిబన్ ప్రతినిధిగా చెప్పుకునే జబీవుల్లా ముజాహిద్ పేరిట వచ్చిన ప్రకటన వచ్చింది. ఇది సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దీంతో సుహేల్ షపీన్ ఓ ట్వీట్ చేస్తూ, కాశ్మీర్ అంశంలో తమ వైఖరిని తేటతెల్లం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments