Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్‌లో మైనస్ 18.8 డిగ్రీలు... హర్యానాలో చలిదెబ్బకు సెలవులు

భూతలస్వర్గంగా భావించే కాశ్మీర్‌లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (09:00 IST)
భూతలస్వర్గంగా భావించే కాశ్మీర్‌లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సీజన్‌లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రికార్డుస్థాయిలో లఢక్ ప్రాంతం‌లో, కార్గిల్‌లో మైనస్ 18.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
శ్రీనగర్‌లో శనివారం మైనస్ 1.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, ఒక్కరోజులోనే ఐదు డిగ్రీలు పతనమైంది. కాశ్మీర్‌లోని మిగతా పట్టణాలు గుల్‌మార్గ్ (మైసన్ 9.4), ఖాజీగుండ్, కుప్వారా (మైనస్ 4.6), కోకర్నాగ్ (మైనస్ 4.4)ల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. 
 
హిమాచల్ ప్రదేశ్‌లోని కొండప్రాంతం కేలాంగ్‌లో మైనస్ 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతోపాటు పంజాబ్, హర్యానా, పలు రాష్ట్రాల్లో పొగమంచు కారణంగా 39 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరో 50 రైళ్లు ఆలస్యంగా నడుపుతుండగా, 16 రైళ్లను వాయిదా వేసినట్లు తెలిపారు. అలాగే, చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేసమయంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కాస్తంత మెరుగుపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments