Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీ గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞలు... పాక్ కీలక నిర్ణయం

యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:41 IST)
యూరీ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఓడరేవు పట్టణమైన కరాచీ గగనతలంపై విమానరాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. పాక్ సర్కారు నోటామ్ (నోటీస్ టు ఎయిర్ మెన్) విడుదల చేస్తూ, కరాచీ గగనతలంపై 33 వేల అడుగులకన్నా తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలు నిషేధమని తెలిపింది. కరాచీ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (ఎఫ్ఐఆర్) సేవలు అందవని తెలిపింది. 
 
కాగా, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోనే ఉండే కరాచీ నగరంపై నుంచి ఎన్నో విమానాలు వెళుతుంటాయి. నాగపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చే సర్వీసులన్నీ ఇదే మార్గంలో ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇవన్నీ ఏదో ఒకదశలో కరాచీ ఎఫ్ఐఆర్‌తో సంబంధాన్ని కొనసాగిస్తాయి. ఇక కరాచీ అందుబాటులో లేని వేళ, ఢిల్లీ ఎఫ్ఐఆర్ పరిధిలోకి వచ్చే ముందు ఇరాన్, ఆప్ఘనిస్థాన్‌లోని ఎయిర్ పోర్టుల్లోని ఎఫ్ఐఆర్‌లతో సంబంధం పెట్టుకోవాల్సి వుంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments