Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ స్టార్ట్...

చిత్తూరు జిల్లాలోని రామసముద్రంలో రెండో రోజు ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ ప్రారంభమైంది.గత రెండురోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:29 IST)
చిత్తూరు జిల్లాలోని రామసముద్రంలో రెండో రోజు ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ ప్రారంభమైంది.గత రెండురోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రెండురోజుల క్రితం రామసముద్రంలో ఒక వృద్ధుడిని తొండంతో కొట్టి చంపిన ఏనుగును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒక ఏనుగు పురాండ్లపల్లె, ఎర్రపల్లె, మూగవాడి, ఎం.గొల్లపల్లె, మినికి, రామసముద్రం పొలాల్లో తిరుగుతూ పంట మొత్తాన్ని నష్టం చేసింది. గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు.
 
ఆపరేషన్‌ ఎలిఫెంట్‌ పేరుతో శిక్షణ ఇచ్చిన రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. సోమవారం రాత్రి వరకు భీభత్సం సృష్టించిన ఏనుగును పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఏనుగు దొరకలేదు. దీంతో చివరి ప్రయత్నంగా మంగళవారం కూడా అటవీశాఖాధికారులు ఏనుగును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగు అటవీశాఖాధికారుల వలలో పడితే కర్షాటకలోకి కారంగి అడవివైపు పంపించే ప్రయత్నం చేయనున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments