Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బుద్ధి మారదా? కాల్పుల ఉల్లంఘన.. ఐదుగురు పౌరుల మృతి

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడం ద్వారా పాక్ తన వంకర బుద్ధిని మరోసారి మార్చుకోలేదని నిరూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (14:48 IST)
పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడం ద్వారా పాక్ తన వంకర బుద్ధిని మరోసారి మార్చుకోలేదని నిరూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తూనే.. 36 గంటల్లో మూడు సార్లు కాల్పులకు తెగబడింది.  జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో తొమ్మిది బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగింది. మోర్టార్ షెల్స్, హెవీ ఫైరింగ్‌తో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు మృతి చెందాయి. 
 
శుక్రవారం నుంచి కాల్పులు మొదలెట్టిన పాక్ సైన్యం.. శనివారం కూడా కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించగా... కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పాక్ కాల్పులకు భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్-పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments