Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమీషన్లు తీసుకుంటే తప్పేంటని అడిగారు..? పదవికి రాజీనామా చేశారు?

రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామ

కమీషన్లు తీసుకుంటే తప్పేంటని అడిగారు..? పదవికి రాజీనామా చేశారు?
, ఆదివారం, 18 మార్చి 2018 (13:06 IST)
రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కమీషన్లు తీసుకోకపోతే.. పనులు జరగవని చాలామంది అనుకుంటూవుంటారు. కానీ సిరిసిల్ల ఛైర్ పర్సన్ పావని కూడా ఈ వార్తలను నిజమని తేల్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నామని బాంబు పేల్చారు.

తాము ఎన్నికల్లో ఎంతో ఖర్చు పెట్టామని, కాంట్రాక్టర్ల నుంచి 3 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నామని ఓ పట్టణ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా నేత వ్యాఖ్యానించడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని మీడియా ముందు పావని చెప్పడం సంచలనానికి దారితీసింది. ఇంకా పర్సంటేజీలు తీసుకుంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఇంకా మంత్రిగారి ప్రోత్సాహంతోనే తాము కమిషన్లు తీసుకుంటున్నామని.. నిత్యమూ ప్రజాసేవలో ఉండే తమకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తే తప్పేంటని అడిగారు.

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు. కమీషన్ల వ్యవహారంలో ఆమె నోరు జారడంతో పార్టీ పెద్దల నుంచి ఏర్పడిన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణకు శుభదినాలే.. ఆదివారం మాత్రం మాంస భక్షణ చేయకూడదు..