Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం: నౌకలు ఢీ... 32మంది గల్లంతు.. జలాలు కలుషితం

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవా

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (09:35 IST)
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న ఘటనలో 32 మంది గల్లంతయ్యారు. ''సాంచీ'' అనే నౌక 64వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న ''సీఎఫ్ క్రిస్టల్'' అనే సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. షాంఘైకి 160 నాటికల్  మైళ్ల దూరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చమురు రవాణా నౌకకు మంటలు అంటుకోవడంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్తి నష్టం చేకూరింది. ఆయిల్ ట్యాంకర్- సరుకు రవాణా నౌక ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. గల్లంతైన వారిలో 30 మంది ఇరాన్ దేశస్తులు, ఇద్దరు బంగ్లాదేశీయులు వున్నారు.
 
ఈ ప్రమాదం ద్వారా చమురు ఒలికిపోవడంతో చైనా సముద్ర జలాలు కలుషితం అయినట్లు చైనా రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments