Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో ఘోరం- గాల్లోనే పేలిపోయిన విమానం.. 160 మంది మృతి.. 80 మంది సైనికులు కూడా?

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (12:34 IST)
ఇరాన్‌లో ఘోరం జరిగింది. బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 160 మంది ప్రయాణీకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ మీడియా వెల్లడించింది. 
 
ఇకపోతే.. ఇరాన్ అన్నంత పని చేస్తోంది. తమ మిలిటరీ కమాండర్‌ సులేమాని మృతికి దారుణమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై 15 బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడులలో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికా మిలిటరీ చాపర్లు, ఇతర సామాగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై క్షిపణులతో ఇరాన్ దాడి చేసిందని తెలిపింది.
 
ఈ యుద్ద వాతావరణంలో ఇరాన్, ఇరాక్ దేశాల గగనతలం ద్వారా విమాన ప్రయాణాలు ప్రమాదకరమని అమెరికా తన విమానయాన సంస్థలను హెచ్చరించింది. ఈ విమానాల సర్వీస్‌లను రద్దు చేసింది. మరోవైపు భారత్ కూడా ఆ దేశాల మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments