Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతిమయాత్రలో తొక్కిసలాట... 35 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (17:56 IST)
ఇరాన్ సైనిక దళానికి చెందిన అగ్రనేత ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా డ్రోన్ల దాడిలో సులేమానీ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఈయన అంత్యక్రియల్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 
 
అమెరికా రాకెట్ దాడిలో హతమైన సులేమానీ అంత్యక్రియలు కెర్ మన్ పట్టణంలో జరిగాయి. తమ అభిమాన వ్యక్తి పార్థివ దేహాన్ని చూసేందుకురావడంతో జనం ఒక్కసారిగా తోసుకునిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో 35 మంది మరణించగా, 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఇరాన్ టీవీ అధికారికంగా ప్రకటించింది. 
 
మరోవైపు, ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ సులేమానీ సహా మరో ఐదుగురు అధికారులను డ్రోన్‌ దాడితో అమెరికా సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. తమ అభిమాన అధికారిని అమెరికా హత్య చేయడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇరాన్‌ హెచ్చరించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments