Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఎన్నికలు... పిట్టల్లా రాలుతున్న ఎన్నికల సిబ్బంది. ఎందుకు?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:54 IST)
ఇండోనేషియాలో అధ్యక్ష పదవి కోసం ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి. దాదాపు 26 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న ఆ దేశంలో ఎన్నికల కమిషన్ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది. ఇండోనేసియాలో 19 కోట్ల మంది ఓటర్లు ఉండగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ మన దేశంలో ఉన్నట్లు ఒక మనిషికి ఒక ఓటు కాకుండా ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 
 
ఎన్నికల నిర్వహణ వరకు బాగానే జరిగినా ఆ తర్వాత కౌంటింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 22వ తేదీన వెలువరించాల్సి ఉన్నందున కోట్ల సంఖ్యలో ఉన్న బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి మరీ కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో వందలాది మంది సిబ్బందికి అలసట ఎక్కువై తట్టుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు.

శనివారం వరకు 272 మంది ఎన్నికల సిబ్బంది ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయారని, మరో 1,878 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి అధికారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఓ సర్కులర్ విడుదల చేసింది.

చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే యోచనలో ఆర్థికశాఖ ఉంది. ఇలా ఉండగా ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోర వైపల్యం చెందిందని, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments