Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోర్డింగ్ వీసాపై ఉంటున్న భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (09:42 IST)
ఆస్ట్రేలియా పోలీసులు ఘాతుకానికి పాల్పడ్డారు. బోర్డింగ్ వీసాపై ఉంటున్న ఓ భారతీయుడిని కాల్చిచంపేశారు. మృతుడిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహ్మద్ రహమతుల్లా అహ్మద్(32)గా గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా పోలీసులను సైతం బెదిరించాడు. దీంతో అహ్మద్‌ను కాల్చి చంపినట్టు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ఈ కాల్చేవిత ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొంది. ఈ విషయాని విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతో పాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపింది. 
 
అయితే, భారతీయుడిని కాల్చివేత ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందిస్తూ, సిడ్నీ ఆబర్న్ రైల్వే స్టేషన్‌లో అహ్మాద్ ఓ క్లీనర్‌ (28)ను కత్తతో పొడిచి దాడిచేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, ఆ సమయంలో స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పైగా, వారిపై దాడికి యత్నించాడు. 
 
దీంతో అహ్మద్‌పై పోలీస్ అధికారి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు బుల్లెట్లు ఛాతిలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అహ్మద్‌ ప్రవర్తించిన తీరుతో ఆయనపై కాల్పులు జరపడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments