బోర్డింగ్ వీసాపై ఉంటున్న భారతీయుడిని కాల్చి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (09:42 IST)
ఆస్ట్రేలియా పోలీసులు ఘాతుకానికి పాల్పడ్డారు. బోర్డింగ్ వీసాపై ఉంటున్న ఓ భారతీయుడిని కాల్చిచంపేశారు. మృతుడిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహ్మద్ రహమతుల్లా అహ్మద్(32)గా గుర్తించారు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడవడమే కాకుండా పోలీసులను సైతం బెదిరించాడు. దీంతో అహ్మద్‌ను కాల్చి చంపినట్టు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ఈ కాల్చేవిత ఘటనపై ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొంది. ఈ విషయాని విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగంతో పాటు పోలీసు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపింది. 
 
అయితే, భారతీయుడిని కాల్చివేత ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందిస్తూ, సిడ్నీ ఆబర్న్ రైల్వే స్టేషన్‌లో అహ్మాద్ ఓ క్లీనర్‌ (28)ను కత్తతో పొడిచి దాడిచేశాడు. ఆ తర్వాత ఆబర్న్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, ఆ సమయంలో స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పైగా, వారిపై దాడికి యత్నించాడు. 
 
దీంతో అహ్మద్‌పై పోలీస్ అధికారి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అందులో రెండు బుల్లెట్లు ఛాతిలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అహ్మద్‌ ప్రవర్తించిన తీరుతో ఆయనపై కాల్పులు జరపడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments