Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోండి : ఇమ్రాన్ పిలుపు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (09:05 IST)
భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పైగా, ఈ బిల్లుపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో మోడీపై ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 
 
ప్రధాని మోడీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు .అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని, ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని సూచించారు. 
 
కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ అంతే ఘటుగా సమాధానం ఇచ్చింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు. ఇల్లు చక్కదిద్దుకుని వీధిలోకి రావాలంటూ సూటిగా చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments