Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోండి : ఇమ్రాన్ పిలుపు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (09:05 IST)
భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పైగా, ఈ బిల్లుపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో మోడీపై ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 
 
ప్రధాని మోడీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు .అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని, ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని సూచించారు. 
 
కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ అంతే ఘటుగా సమాధానం ఇచ్చింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు. ఇల్లు చక్కదిద్దుకుని వీధిలోకి రావాలంటూ సూటిగా చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments