చైనా నిఘా బెలూన్ భారత గగనతలంపై తిరిగిందా?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:40 IST)
Andaman
భారత్ గగనతలంపై గత ఏడాది ఓ భారీ చైనా బెలూన్ కనిపించిందని అధికారులు వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అంతకుముందు చైనా బెలూన్‌ను అమెరికా కూల్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో గత ఏడాది అండమాన్ నికోబార్ దీవులపైనా ఆకాశంలో ఒక పెద్ద బలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణ శాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కానీ అప్పట్లో అదేంటో ప్రజలకు, అధికారులకు అర్థం కాలేదు. 
 
భారత సైన్యం దీన్ని గుర్తించినప్పటికీ, కూల్చివేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకునే లోపే నైరుతి దిశగా భూభాగాన్ని దాటి సముద్రతలం పైకి వెళ్లిపోయిందని ఓ కథనంలో వెల్లడించారు. 
 
అప్పట్లో దాన్ని వాతావరణ పరిశోధనల బెలూన్ అనే భావించారు. ఇటీవల చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేసిన పరిణామాల నేపథ్యంలో.. దేశ రక్షణ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. నాడు కనిపించిన బెలూన్ నిఘా వేసేందుకు ఉద్దేశించినదే అయ్యుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments