Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది': పాక్ మంత్రి హెచ్చరిక

పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీల

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (18:02 IST)
పాకిస్థాన్ సమాచార శాఖామంత్రి పర్వైజ్ రషీద్ భారత్‌ను హెచ్చరించారు. 'శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుంది' అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్‌లో అశాంతి కొనసాగినంత కాలం ఢిల్లీలో శాంతి ఉండబోదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. 
 
యురీ ఘటన తర్వాత పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రషీద్ స్పందించారు. క్రూరత్వం మాత్రమే ఏకాకి అవుతుందన్న ఆయన కాశ్మీరీలను హింసిస్తున్న భారత్ మాత్రమే ఒంటరిగా మిగులుతుందని జోస్యం చెప్పారు. శ్రీనగర్‌లో చుక్క రక్తం చిందినా, అక్కడ రక్తం ఏరులై పారుతుందని దీనికి భారతే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 
తమ దేశంలో పేదరికం, నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. యూరోప్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్(ఏఎస్ఈఏఎన్)నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. భారత్‌తో చర్చల కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments