Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీ కొత్త ఆంక్షలు.. భారత్‌తో పాటు విదేశీయులపై వీసా నిషేధం

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (11:29 IST)
కరోనా మహమ్మారి నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా తాజాగా కొత్త ఆంక్షలను విధించింది. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల విదేశీయులపై వీసా నిషేధాన్ని చైనా విధించింది. వీసా ఉన్నవారికి కూడా తాత్కాలికంగా ఎంట్రీని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీలో ఉన్న చైనా ఎంబసీ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన, సేవాపరమైన, సీ వీసాలు ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదు అని ఎంబసీ తన ప్రకటనలో పేర్కొంది. 
 
అత్యవసరం ఉన్నవారు, మానవతా సాయం చేసేవారు.. చైనా ఎంబసీలో దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎంబసీ వెల్లడించింది. కరోనా పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలు ఉంటాయని చైనా వెల్లడించింది. చైనా విధించిన నిషేధం కేవలం భారత్‌కు మాత్రమే కాదు అని, ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
నవంబర్ 3వ తేదీ తర్వాత వీసాలు జారీ అయినవారికి ఈ ఆంక్షలు వర్తించవు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, బంగ్లాదేశ్‌, పిలిప్పీన్స్ దేశాల నుంచి వస్తున్న వారిపైన కూడా చైనా తాత్కాలిక నిషేధం విధించింది. తాత్కాలిక నిషేధానికి సంబంధించి చైనా ఎంబసీ తన నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments