Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ నుంచి మిడతలు వచ్చేస్తున్నాయ్.. కేంద్రానికి మరో తలనొప్పి

Webdunia
బుధవారం, 1 జులై 2020 (16:27 IST)
మిడతలతో తలనొప్పి తప్పేలా లేదు. కరోనా ఓవైపు వేధిస్తుంటే.. మరోవైపు మిడతలు దేశంలోని 101 జిల్లాలకు వ్యాపించాయి. తొమ్మిది రాష్ట్రాల రైతులు మిడతల దాడిలో తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా కీటక నాశకాలను పిచికారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రయత్నం ఎంత విజయవంతమవుతుందో తేలాల్సి ఉంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మరో గండం ఇరాన్‌లో సమాయత్తమవుతోంది. ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతంలో మరో మిడతల గుంపు తయారు అయ్యిందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. ఇది రాబోయే నెలల్లో మరోసారి భారతదేశానికి వలస వెళ్లి మళ్ళీ పంటల నాశనానికి దారి తీస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మిడతలను నియంత్రించేందుకు హెచ్‌ఐఎల్ ఇండియా లిమిటెడ్ 25 మెట్రిక్ టన్నుల మలాథియాన్ (95% యుఎల్‌వి) ఇరాన్‌కు పంపింది.
 
ఇదిలా ఉంటే 2,33,487 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలన్నీ మిడతల దాడికి గురయ్యాయని ఇప్పటికే కేంద్రం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని 40 జిల్లాలు, రాజస్థాన్‌లో 31 జిల్లాలు, యూపీలోని 13 జిల్లాలు మిడతల కారణంగా దాడికి గురయ్యాయి. ఇంకా హర్యానా, బీహార్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌లలో కూడా మిడతల ప్రభావం భారీగా ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments