Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (21:28 IST)
ప్యాంగాంగ్‌ సరస్సు నుంచి చైనా, భారత్‌ బలగాల ఉపసంహరణ మొదలైందని చైనా సైన్యం బుధవారం తెలిపింది. కొన్నినెలలుగా సరిహద్దులో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 'ఫిబ్రవరి 10 నుంచి పాంగాంగ్‌తో సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని చైనా, భారత్‌ ఫ్రంట్‌లైన్ దళాలు ఉపసంహరణ మొదలైంది. భారత్, చైనా మధ్య కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి 9వ విడత చర్చల్లో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు' పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సీనియర్‌ కల్నల్‌ వీ కియాన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
కాగా, తూర్పు లఢాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు జనవరి 24న ఇరుదేశాల మిలటరీ కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య 9వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. కమాండర్ల మధ్య జరిగిన చివరి రౌండ్‌ చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో తూర్పు లఢాఖ్‌లోని అన్ని వివాదాస్పద కేంద్రాల నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments