Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దు వివాదాలను అలా పరిష్కరించుకోవాలి.. చైనాకు అమెరికా చెక్

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (14:44 IST)
వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో కయ్యాలకు తెగబడుతున్న చైనాకు సంబంధించి అమెరికా చట్ట సభ ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్‌తో సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం చైనాకు స్పష్టం చేసినట్టైంది. సరిహద్దు వివాదాలను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు భారత్‌ వంటి మిత్రదేశాలకు అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా ప్రకటించారు.
 
ఇందులో భాగంగా 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆ దేశ రక్షణ బిల్లు నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్డీఏఏ)కు అక్కడి కాంగ్రెస్‌ ఆమోద ముద్ర లభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై చైనా దురాక్రమణ గురించి భారత సంతతి కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీర్మానం కూడా ఇదే బిల్లులో భాగంగా ఉంది. ఇందుకు సభ్యుల ఆమోదం లభించడంతో ఈ తీర్మానానికి కూడా సమ్మతి లభించినట్లయింది. ఈ బిల్లును ఆపేందుకు తన విశేషాధికారమైన వీటోను వాడుతానని డొనాల్డ్ ట్రంప్‌ బెదిరించినప్పటికీ.. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments