Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా? డొనాల్ట్ ట్రంప్ ఏమన్నారు?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:14 IST)
భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉభయ దేశాల మధ్య కలగజేసుకొని సాయం చేయడానికి తాను ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు.
 
ఇందులో భాగంగా ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్‌ను చైనా బెదిరింపులకు గురిచేస్తోందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''అలా ఏమీ లేదు. కానీ, ఆ దిశగా అడుగులు వేస్తోంది. చాలా మంది అంచనాల కంటే బలంగా, వేగంగా ముందుకు వెళుతోంది'' అని వ్యాఖ్యానించారు.
 
లడాఖ్‌లో ఘర్షణ వాతావరణం ప్రారంభమైన సందర్భంలో, గల్వాన్‌ ఘటనా సమయంలోనూ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ తెలిపారు. ఆయన ప్రతిపాదనను ఉభయ దేశాలూ తిరస్కరించాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం దౌత్య మార్గాల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకుంటామని తెలిపాయి. ఇందులో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments