డోక్లామ్ నుంచి భారత్ దళాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు తెరపడింది..

భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లామ్ సమస్య తొలగిపోయింది. డోక్లామ్ నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించడంతో పాటు ఉపసంహరణ ప్రారంభించడంతో కొన్ని నెలల పాటు రెండు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:13 IST)
భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లామ్ సమస్య తొలగిపోయింది. డోక్లామ్ నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించడంతో పాటు ఉపసంహరణ ప్రారంభించడంతో కొన్ని నెలల పాటు రెండు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనకు తెరపడింది.

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనడానికి చైనా పర్యటనకు వెళుతున్న సందర్భంలో భారత్‌ తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. డోక్లామ్ వద్ద భారత్- చైనాలు కొద్ది వారాల పాటు దౌత్యపరమైన చర్చలు జరిపాయి. 
 
ఈ చర్చల ప్రాతిపదికన డోక్లామ్‌లోని ప్రతిష్టంభన ప్రాంతం నుండి సరిహద్దు దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీన్ని చైనా కూడా ధ్రువీకరించింది.

సిక్కిం సెక్టార్‌లోని తమ భూభాగంపై సార్వభౌమాధికారానికి చిహ్నంగా చైనా దళాలు డోక్లాంలో గస్తీ కాస్తుంటాయని చైనా రాజధాని నుండి వచ్చిన మరో వార్త తెలియజేసింది. 
 
డోక్లామ్‌ పీఠభూమిలో చైనా-భూటాన్‌ల మధ్య వివాదంలో ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు మార్గం నిర్మిస్తుండడంతో గత జూన్‌లో భారత్‌ సరిహద్దు దళాలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది.

ఈ నేపథ్యంలో డోక్లామ్‌ నుండి భారత దళాలు ఉపసంహరించుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను దేశ రక్షణ వర్గాలు కూడా నిర్ధారించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments