Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను మూడో అంతస్తు నుంచి 2సార్లు తోసేసింది.. ఇంట్లోకి వెళ్ళి మేకప్‌తో బయటికొచ్చింది..

కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:59 IST)
కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి అక్కడే నివాసం వుంటున్నారు. కాంచన్‌ సర్కార్‌ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్‌ అనలిస్టుగా పని చేస్తుండగా, అతని భార్య స్వాతి సర్కార్‌ ఓ పాఠశాలలో హిందీ టీచరుగా పని చేసేది. 
 
కానీ కొద్దికాలంలో స్వాతి మానసిక ప్రవర్తన బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసింది. ఇక భర్త కూడా కొద్దికాలంగా భార్యకు దూరంగా వుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవాడు. దీంతో స్వాతి సర్కార్ బుద్ధి మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం స్వాతి తన ఏడేళ్ల కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుపై నుంచి కిందకు తోసేసింది. 
 
శ్రేయ మూగ బాలిక కావడంతో కేకలు వేయలేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని స్వాతి మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేసింది. ఈ ఘటనలో శ్రేయా తీవ్రగాయాలతో మృతి చెందింది. ఆ తర్వాత స్వాతి ఏమీ తెలియనట్లుగా ఇంట్లోకి వెళ్లి మేకప్ వేసుకుని ముస్తాబై బయటికి వచ్చింది. 
 
కూతురి మృతదేహం ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తల్లిని స్థానికులు పట్టుకుని దేహశుధ్ది చేశారు. ఆపై ఆమెను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పుట్టెనహళ్లి పోలీసులు కుటుంబ కలహాలతోనే శ్రేయను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments