Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ప్రధానిగా మళ్లీ మోడీనే రావాలి : ఇమ్రాన్ ఖాన్

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (14:45 IST)
భారత్ ప్రధాని పగ్గాలను మళ్లీ నరేంద్ర మోడీనే చేపట్టాలని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇండియాలో లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఇలా అనడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మాజీ క్రికెటర్ కోరిక వెనుక కారణాలు కూడా ఉన్నాయి. 
 
మోడీ ప్రధాన మంత్రి అయితే కాశ్మీర్ సమస్య ఓ కొలిక్కి వస్తుందని, కాంగ్రెస్ పాలనలోకి వస్తే వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందని, వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ వింగ్‌కు భయపడుతుందని అభిప్రాయపడ్డారు. 
 
భాజపా ప్రతిపక్షంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కాశ్మీర్ వంటి కీలకమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మోడీ అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరని ఆశాభావం వ్యక్తంచేశారు.
 
భారత్‌లో ముస్లింలు గతం నుంచి సురక్షితంగానే ఫీలయ్యే వారని అయితే హిందూ అతివాదం వల్ల ఇండియాలోని ముస్లింలలో కొంత భయం నెలకొని ఉందని మాత్రం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మోడీకి ఇమ్రాన్ మంచి కితాబు ఇచ్చినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments