Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిగ్గింగ్ చేసినా నేనే గెలుస్తా: కొండా విశ్వేశ్వర రెడ్డి

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:53 IST)
ఈనెల 11వ తేదీన జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సక్రమంగా జరిగితే తనకు 2 లక్షల పైచిలుకు మెజారిటీ వస్తుందని, అధికార తెరాస రిగ్గింగ్ చేసినా తానే గెలుస్తానని, రెండో స్థానం కోసం తెరాస, బీజేపీలు పోటీపడుతున్నాయని అన్నారు.
 
మరోవైపు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ సందీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి సిన్ టవర్స్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ వద్ద నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల డబ్బును ఓట్ల కోసం పంపిణీచేసినట్టు తెలుస్తోంది. పంపకాల వివరాలన్నీ కోడింగ్ రూపంలో ఉండటంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. రూ.15 కోట్ల పైచిలుకు నగదుని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సందీప్ రెడ్డి కలిసి పంచినట్లుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments