Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరవ్ మోదీకి బెయిల్ తిరస్కరణ.. భారత్‌కు అప్పగిస్తే మాత్రం చచ్చిపోతా?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:58 IST)
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగనామం పెట్టి భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లిపోయిన నీరవ్ మోదీకి యూకే కోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే నాలుగు సార్లు నీరవ్ మోడీ బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించింది కోర్టు. అయితే నేరస్తుల అప్పగింత కింద భారత్‌కు అప్పగించడంపై సవాల్‌ చేస్తూ నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. 
 
అయితే భారత్‌కు నీరవ్ మోదీని అప్పగించాలంటూ వాదనలు భారత్ తరపున వాదనలు వినిపిస్తుంది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్). అయితే భారత్‌కు తనను అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని నీరవ్ మోదీ బెదిరిస్తున్నాడని వారు వాదించారు. దీనిని బట్టి చూస్తేనే తప్పు చేసి తప్పించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అర్థం అవుతుందని వాదించారు.
 
ఇదే క్రమంలో నీరవ్ మోడీ తరపు న్యాయవాది హ్యూగో కీత్, ఇద్దరు జైలు ఖైదీలు మోడీని బెదిరించారని, కొట్టారని కోర్టుకు వెల్లడించారు. 24 గంటల పర్యవేక్షణతో భద్రతను 2 మిలియన్ పౌండ్ల నుండి 4 మిలియన్ పౌండ్లకు పెంచాలని న్యాయవాది కోర్టుకు ప్రతిపాదించారు. మొత్తం వాదనలు విన్న కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించి వచ్చే ఏడాది మేలో తదుపరి విచారణ జరపనున్నట్లు చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments