Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు : ఖర్చులో సగం సొమ్ము భారత సైన్యానికి..

Advertiesment
ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దు : ఖర్చులో సగం సొమ్ము భారత సైన్యానికి..
, గురువారం, 7 నవంబరు 2019 (10:39 IST)
ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. ఈ వేడుకలకు అయ్యే ఖర్చులో సగం మొత్తాన్ని భారత సైన్యానికి అందజేయాలని భావిస్తోంది. 
 
ప్రతీ యేటా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అసలు బీసీసీఐకి టీమిండియా ఆడే మ్యాచ్‌ల కంటే.. ఐపీఎల్ ద్వారానే వచ్చే ఆదాయమే అత్యధికంగా ఉంది. ఇలా కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు.. ప్రతీ ఏడాది ప్రారంభ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 
 
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా.. ఆరంభ వేడుకలను.. బీసీసీఐ రద్దు చేయాలనుకుంటుందట. ప్రారంభ వేడుకలకు డబ్బు అనవసరంగా ఖర్చు అవుతోందని.. అందులోనూ.. అభిమానులు కూడా వీటిపై ఆసక్తి చూపకపోవడంతోనే.. వీటిని రద్దు చేయాలనుకుంటుందట. 
 
అలాగే.. ఈ వేడుకల్లో పాల్గొన్న నటీనటులకు, కళాకారులకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని.. అందులో ఐపీఎల్-2020 సీజన్ నుంచి ప్రారంభ వేడుకలు లేకుండా.. టోర్నీలు కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని ఓ అధికారి తెలిపారు. మరో కారణమేమంటే, పూల్వామా ఉగ్రదాడిలో పలువురు జవాన్లు అమరులు అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో అప్పటి సీఓఏ వేడకలను రద్దు చేసి.. ఆ మొత్తం ఖర్చులో సగం భారత సైన్యానికి విరాళం ఇచ్చింది బీసీసీఐ. ఇప్పుడు కూడా అలానే చేయాలని బీసీసీఐ భావిస్తోందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ భవిష్యత్.... మన గ్రేట్ సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడివుంది : యూవీ