Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాదాపు మేం చచ్చామనుకున్నాం... అర్జున రణతుంగ

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:50 IST)
శ్రీలంకలో అధికార పోటీ ఏర్పడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహిందా రాజపక్సేను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ హుటాహుటిన కొలంబోకు చేరుకుని తన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మహిందా రాజపక్సే అనుచరులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా, ఆయన్ను లంక సైన్యం రక్షించింది. 
 
దీనిపై అరున రణతుంగ స్పందిస్తూ, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలే కారణం. రాజపక్సే అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments