Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాదాపు మేం చచ్చామనుకున్నాం... అర్జున రణతుంగ

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:50 IST)
శ్రీలంకలో అధికార పోటీ ఏర్పడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహిందా రాజపక్సేను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ హుటాహుటిన కొలంబోకు చేరుకుని తన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మహిందా రాజపక్సే అనుచరులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా, ఆయన్ను లంక సైన్యం రక్షించింది. 
 
దీనిపై అరున రణతుంగ స్పందిస్తూ, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలే కారణం. రాజపక్సే అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments