Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబో పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న నటి రాధిక

Webdunia
ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (13:22 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 140 మంది వరకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఈస్టర్ సండేను పురస్కరించుకుని ప్రార్థనల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 
 
ఈ పేలుళ్ళు కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్‌, సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌, కింగ్స్‌బరి హోటళ్లలో సంభవించాయి. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. ప్ర‌స్తుతం కొలంబోలో హై అలర్ట్ ప్రకటించారు. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. 
 
కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బ‌స చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఈ హెటల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారట‌. దాంతో ఆమె పెద్ద ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌కి షాకింగ్‌గా ఉంద‌ని, ఇప్ప‌టికి న‌మ్మ‌లేక‌పోతున్నానంటూ రాధిక త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments