Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తమోడిన కాబూల్‌ - బాంబు పేలి 66 మంది మృతి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (09:21 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ మసీదులో శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 66 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఖలీసా సాహిబ్ మసీదుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో మసీదు కిక్కిరిపోయింది. ఇదే అదునుగా భావించిన ఓ ఉగ్రవాది మానవబాంబుగా మారి తనను తాను పేల్చుకున్నాడు. 
 
అప్పటివరకు ఎంతో కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారికాగ రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. సున్నీ తెగకు చెందిన ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగింది. శనివారం ఉదయం వరకు 66 మంది చనిపోయారు. మరో 78 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
అయితే, ఈ మానవబాంబు పేలుడుకు ఇప్పటివరకు ఏ ఒక్క సంస్థా నైతిక బాధ్యత వహించలేదు. పేలుడుపై ఆప్ఘన్ భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మసీదు వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఈ పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూడా కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments